Tuesday 17 August 2010

జీవిత, రాజశేఖర్ లకు చంపుతామని బెదిరింపులు


ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై విమర్శలు మానకపోతే చంపేస్తామంటూ సినీ నటుడు రాజశేఖర్, జీవిత దంపతులకు బెదిరింపులు వచ్చాయి. చిరంజీవిపై ఆరోపణలు మానుకోకపోతే మానవబాంబు దాడులు జరుగుతాయని ఆగంతకులు మెసేజ్ లు పంపారు. ఈ మేరకు రాజశేఖర్, జీవిత దంపతులు హైదరాబాదులోని జూబిలీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబిలీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కాపునాడు సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ పేరు మీద ఓ సందేశం వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ 9963561116. ఈ ఫోన్ నెంబర్ శ్రీనివాస్ కు చెందింది. అయితే ఆ మెసేజ్ శ్రీనివాస్ పంపాడా, ఆయన పేరు మీద మరెవరైనా పంపారా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో నాలుగు ఫోన్ ల నుంచి కూడా మెసేజ్ లు వచ్చాయి. వాటికి కాల్ చేస్తే రెండు స్విచ్ఫాఫ్ చేసి ఉన్నాయి. మరో రెండు రింగతువుతున్నాయి. కానీ ఎవరూ ఎత్తడం లేదు. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు చిరునామాలు, ఫోన్ యజమానుల పేర్లను సేకరిస్తున్నారు.

No comments:

Post a Comment