![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjpAOIl2IEfqyvZeJolCZD05Lm1nWADQlAXiNyZT1BGfqdstDEJhKGbulmm9r-EY7Kj3WgyBk3THgtLKD1jiIzmLjUcsoUzPiMhEmG7MNn8RoS9_h_ocr50BJ7o4wv34tNoS-lGp9qPf_1Q/s320/sanushap51290770062.jpg)
పవన్ కళ్యాణ్ నటించిన ‘బంగారం’ చిత్రంలో హీరోయిన్ కి చెల్లెలుగా నటించిన సానుషా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ అమ్మడు హీరోయిన్ గా రంగప్రవేశం చేస్తోంది. తెలుగు, తమిళంలో సిమ్రాన్ ఓ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ద్వారా సానుషా కథానాయికగా పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఓ తమిళ సినిమాలో సానుషా కథానాయికగా నటించింది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు. తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ గా సానుసా సుపరిచితురాలే కాబట్టి తెలుగు ప్రేక్షకులను కూడా తన అందచందాలతో కట్టి పడేస్తుందని సిమ్రాన్ భావిస్తోండట. హీరోయిన్ గా తనని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న సిమ్రాన్ కు కృతజ్ఞతలు చెబుతోంది సానుషా
No comments:
Post a Comment